నిర్మల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో దళిత కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని 52 మంది దళిత బంధు లబ్ధిదారులకు గురువారం ఆయన వాహనాలను అందజేశారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. పథకంలో లబ్ధిదారులకు రంగాల్లోనే యూనిట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు.