హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ర్టాలకు తాజాగా రూ.1,39,750 కోట్లు విడుదలయ్యాయి. అందులో తెలంగాణకు రూ.2,937.58 కోట్లు పంపిణీ చేశారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.25,066.88 కోట్లు, బీహార్కు 14,056.12 కోట్లు, మధ్యప్రదేశ్కు 10,970.44 కోట్లు, పశ్చిమ బెంగాల్కు 10,513.46 కోట్లు, ఏపీకి 5,655.72 కోట్లు విడుదల చేశారు. కేంద్ర పన్నుల్లో వాటా కింద ప్రస్తుత 2024-25లో ఇప్పటివరకు రాష్ర్టాలకు మొత్తం రూ.2,79,500 కోట్లు పంపిణీ చేసినట్టు మోదీ సర్కారు తెలిపింది.