ఖమ్మం, ఫిబ్రవరి 15: ‘వాడవాడకు పువ్వాడ’లో భాగంగా బుధవారం రెండో రోజు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వన్టౌన్, ఖానాపురం, అల్లీపురం తదితర డివిజన్లలోని 104 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అందజేశారు. మంత్రి మోటర్సైకిల్పై స్వయంగా వారి ఇంటికెళ్లి చెక్కులతోపాటు చీర, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు, కుటుంబ సభ్యుల వివరాలను, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్యే ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమాన్ని చేపట్టానని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.