బీపీ, షుగర్ బాధితులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు దవాఖానలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ఈ కిట్లను అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీపీ, షుగర్ బారిన పడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులను అందజేస్తున్నదని తెలిపారు.
– బాన్సువాడ