నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 243 మందికి కోటి పదిహేడు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికత్స పొందిన వారికి ఈ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసీఆర్ పర్యవేక్షణలో అత్యాధునిక సదుపాయాలతో ప్రభుత్వ దవాఖానలు అభివృద్ధి చెందాయన్నారు.
నాణ్యమైన వైద్యం ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో నెలకు 700 నుంచి 900 వరకు ప్రసవాల్ని జరుపుతున్నారని డాక్టర్లను అభినందించారు. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్కు పోయి లక్షల రూపాయల్ని వెచ్చించి ఇబ్బందులు పడొద్దని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
వీలైనంతగా ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, ఎపీపీలు కరీం పాషా, నాగలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ కొత్త మొక్కకు జలకన్య పేరు పెట్టిన శాస్త్రవేత్తలు
Supreme Court: జడ్జీల నియామకాల వార్తలపై సీజేఐ రమణ తీవ్ర అసంతృప్తి
స్వర్ణ ప్రాజెక్ట్ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి