ఇందూరు ;మేడేను పురస్కరించుకొని నిజామాబాద్లో 1,500 మంది మున్సిపల్ కార్మికులకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా శనివారం దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్ ఉన్నప్పటికీ మున్సిపల్ కార్మికులు మాత్రం ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పని చేశారని కొనియాడారు. అనంతరం కార్మికులతో కలిసి భోజనం చేశారు.