హైదరాబాద్ : కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులు కోల్పోవడం గానీ లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాల సహాయ కిట్స్ అందించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయ ఆవరణలో గురువారం మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. భావితరాలకు అద్భుతమైన పర్యావరణాన్ని అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు. అనాథ బాల, బాలికలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంగన్వాడీల్లో బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించడం కోసం రూ. 500 ప్రోత్సాహాక చెక్కులను మంత్రి అందించారు.