నర్సంపేట, సెప్టెంబర్ 30 : కాంగ్రెస్ నాయకుల మోసపు మాటలను ప్రజలు న మ్మొద్దని వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేటలో 41 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిస్తున్న ఛత్తీస్గఢ్, కర్ణాటకలో ఇవ్వలేని పథకాలను తెలంగాణలో ఇస్తామని చెబుతున్నదని, వాటిని ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. కాం గ్రెస్, బీజేపీలు అమలుకు సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మోసగిస్తున్నాయని మండిపడ్డారు. దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 5.20 లక్షలమంది దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్నట్టు చెప్పారు.