హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డలకు సర్కారు బతుకమ్మ కానుకగా అందించే చీరల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 1,19,87,721 మంది మహిళలకు చీరల పంపిణీ లక్ష్యంగా జిల్లాల వారీగా సిద్ధం చేశారు. తొలిరోజైన బుధవారం ఒక్కరోజే 4,91,351 మంది సర్కారు కానుకగా అందించే బతుకమ్మ చీరలను అందుకున్నారు. బతుకమ్మ పండుగనాటికి రాష్ట్రంలోని మహిళలందరికీ చీరల పంపిణీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.