ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 7: ఎంబీఏ, ఎంసీఏ దూరవిద్య కోర్సుల్లో రెండోదశ ప్రవేశపరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే ఈ కోర్సులకు ఈ నెల 25న ప్రవేశపరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఈ నెల 10 నుంచి 20 వరకు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 24 వరకు దరఖాస్తులకు అవకాశం ఉన్నదని తెలిపారు.