హైదదరాబాద్ : మెదక్(Medak) జిల్లా బూర్గులపల్లిలో(Burgulapally) ఇరు వర్గాల మధ్య వివాదం(Disputes) చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడమే కాకుండా నాలుగు బైక్లను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల దాడిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్రామీణ సీఐ కేశవులపై రాళ్లు, కట్టెలతో దుండగులు దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.