హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు దవాఖానలను సీజ్ చేశాయి. వీటిలో 115 దవాఖానలకు అసలు రిజిస్ట్రేషనే లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.
అనధికారికంగా వైద్యం నిర్వహిస్తున్నందుకు 29, పరిశుభ్రత పాటించనందుకు 5, మెడికల్ రికార్డులు నిర్వహించనందుకు 3, కాలం చెల్లిన మందులు అమ్ముతున్నందుకు 2, వైద్యసేవల ధరల పట్టికను ఏర్పాటు చేయనందుకు మరో 2 దవాఖానలను సీజ్ చేసినట్టు వెల్లడించారు.