హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగులకు నూతన పీఆర్సీ, ఇతర సౌకర్యాలను వర్తింపజేసే అంశంపై ప్రభుత్వం ఈ నెల 29న చర్చించనున్నది. విద్యుత్తు సౌధలో జరిగే ఈ చర్చలకు హాజరుకావాలని విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నేతలకు లేఖలు పంపించినట్టు టీఎస్ ట్రాన్స్కో అధికారులు లేఖలు తెలిపారు. పెన్షనర్ల వేతన సవరణపై కూడా చర్చించనున్నట్టు పేర్కొన్నారు.