హైదరాబాద్, సెప్టెంబర్ 17 నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం ‘ఎల్ నినో ప్రభావం – నివారణ చర్యలు’ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగం, తాగునీటి ఎద్దడి తదితర పరిణామాలపై సభలో సమగ్ర చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ మేరకు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి అధికారికంగా సభా వ్యవహారాల జాబితాను (లిస్ట్ ఆఫ్ బిజినెస్) గురువారం విడుదల చేశారు. శుక్రవారం నాటి సమావేశంలో అధికా ర, ప్రతిపక్ష సభ్యులు ఎల్ నినో ప్రభావాలు, రైతాంగం ఎదురొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం తీ సుకోవాల్సిన ముందస్తు చర్యలపై త మ వాదనలను వినిపించనున్నారు.