హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్తో చర్చిస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు హామీ ఇచ్చారు. హైదరాబాద్ విద్యుత్తు సౌధలో మంగళవారం తెలంగాణ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ (టీఈఈ) జాక్ ప్రతినిధులతో పీఆర్సీ, ఇతర ముఖ్య సమస్యలపై ఆయన చర్చించారు. 2022 ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ఆర్టిజన్స్, పెన్షనర్స్ కోసం అమలు చేయాల్సిన పీఆర్సీ, ఈపీఎఫ్ టు జీపీఎఫ్, మాస్టర్ సేలు వర్తింపజేసి పర్సనల్ పే చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగుల జీతభత్యాల వ్యత్యాసం కూడా సరిచేస్తామని తెలిపారు.
ఈపీఎఫ్ టు జీపీఎఫ్ విషయంలో ఉద్యోగులందరికీ పింఛన్ సౌకర్యం కల్పించే దిశగా సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని తెలిపా రు. ఈ సమావేశంలో టీఈఈ జాక్ చైర్మ న్ కోడూరి ప్రకాశ్, కన్వీనర్ జీ శివాజీ, కో కన్వీనర్ కేవీ జాన్సన్, సభ్యులు రామేశ్వరయ్య శెట్టి, మాతం గి శ్రీను, నాజర్ షరీఫ్, చారుగుండ్ల రమేశ్, ఆరోగ్యరాణి, రఘోత్తం, కరంట్రావు, యూసుఫ్, అజీజ్, రాములు, నిరంజన్, విశాల్, పున్న శ్రీనివాస్, నరేందర్పాల్, మోసిన్, బాపురెడ్డి ,శ్రీధర్గౌడ్, సతీశ్, కే వెంకటేశ్, లక్ష్మయ్య, ఏసయ్య, ఉషయ్య, విజయ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.