హైదరాబాద్, మార్చి18 (నమస్తే తెలంగాణ): వేతనాల చెల్లింపు విషయంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైం వర్కర్లపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ సంస్థల్లో, కార్యాలయాల్లో వేలాది మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైం వర్కర్లు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలను అందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం మాత్రం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు విడుదల చేస్తూ, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు, పార్ట్టైం వర్కర్లకు నెల 20 రోజులు దాటినా విడుదల చేయలేదని మండిపడ్డారు. దీంతో వారి కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నెలవారీగా ఒకటో తేదీనే వేతనాలు విడుదల చేయాలని కోరారు.