హైదరాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ): వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. బుధవారం ముగిసిన గడువును ఫిబ్రవరి 15 వరకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. గత డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు రూ. 3.59 కోట్లు ఉండగా.. దాదాపు రూ. 1.50 కోట్ల చలాన్లకు పైగా చెల్లింపులు జరిగాయి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీతో ప్రభుత్వానికి రూ. 135 కోట్లకు పైగానే ఆదాయం సమకూరింది. టూ వీలర్స్ , ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.