హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వాహనదారులకు పోలీసుశా ఖ పెండింగ్ చలాన్లు తక్షణమే చెల్లించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ద్విచక్ర వాహనాలకు 80%, ఆటోలు, ఫోర్ వీలర్లకు 60%, ఆర్టీ సీ బస్సులు, తోపుడు బండ్లపై 90 % రాయితీ ఇచ్చింది. భారీ వాహనాలపై 50 % రాయితీ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2 కోట్ల పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. ఈ నెల 26 నుంచి ఈ డిసౌంట్ అందుబాటులో ఉంటుందని పోలీసుశాఖ శుక్రవారం తెలిపింది.
గత ఏడాది ఇలాగే రాయితీ ప్రకటించడంతో 45 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.300 కోట్ల వరకు చలాన్ల రుసుము వసూలైంది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లతోపాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎకడికకడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. గత నెలాఖరు నాటికి పెండింగ్ చలాన్ల సంఖ్య మళ్లీ రూ.2 కోట్లకు చేరుకోవడంతో మరోమారు రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలాను చెల్లించేవారికే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.