ముదిరాజ్ మహాసభ తెలంగాణ విద్యావంతుల వేదిక (ఎంఎంటీవీవీ) అధ్యక్షుడిగా ప్రొఫెసర్ సీహెచ్ దినేశ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నియామక పత్రాన్ని దినేశ్కుమార్కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జాతిని ఐక్యం చేస్తూ రాష్ట్ర కమిటీలను, రాష్ట్ర కార్యవర్గాన్ని నిర్మాణం చేయడం ద్వారా ముదిరాజ్ల అభ్యున్నతికి, సంక్షేమానికి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో పురోగాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.