TSRTC | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నగదు రహిత (క్యాష్లెస్) లావాదేవీల ద్వారా టికెట్లు ఇచ్చే విధానాన్ని టీఎస్ఆర్టీసీ ఇక అన్నిరకాల బస్సుల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింటిలో ఐ-టిమ్స్ పరికరాలను అందుబాటులోకి తేనున్నది. ఇప్పటికే బండ్లగూడ బస్ డిపోను పైలట్ ప్రాజెక్టుగాఎంపిక చేసి డిపోలోని ఆర్డినరీ, మెట్రోసహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్ యంత్రాలను వాడేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి వాటితో చెల్లింపులు చేసి టికెట్ ఇవ్వనున్నారు. టికెట్కు సరిపడా నగదు ఇచ్చినా టికెట్ ఇస్తారు. బండ్లగూడ అనంతరం కంటోన్మెంట్ డిపోలో అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా అమలు చేసేందుకు కార్యచరణ రూపొందించారు.