హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే మార్గంలో రాతి నేలల కింద వజ్ర నిక్షేపాల ఆనవాళ్లు ఉన్నట్టు జాతీయ భూభౌతిక అధ్యయన సంస్థ(ఎన్జీఆర్ఐ) గుర్తించింది. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ తరహాలో ఈ ప్రాంతంలోని కఠిన శిలల కింద వజ్ర ధాతువులు ఉన్నట్టు తేల్చింది.
దాదాపు 250 కోట్ల సంవత్సరాల క్రితం మాగ్మాటిక్ ఉప్పెనలతో ఏర్పడిన ఈ శిలలు.. అంతకంటే ముందు నుంచే ఉన్న ఆర్కియన్ శిలల్లోకి చొరబడి తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు విస్తరించినట్టు వివరించింది. అక్కడ సేకరించిన రాళ్లలో వజ్ర ధాతువులు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించింది.