హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఈ నెల 12న భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి. ధర్నాలో పాల్గొనాలని ఆయా రాజకీయ పార్టీలకు, బీసీ సంఘాలకు, మేధావులు, ప్రొఫెసర్లకు భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత ఒక ప్రక టనలో పిలుపునిచ్చారు.