ధర్మారం, ఆగస్టు13: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బొల్లి ప్రవీణ్రావు అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. బొల్లి శ్యామల-స్వామి దంపతులకు కుమారుడు ప్రవీణ్రావు, కుమార్తె ప్రవళిక ఇద్దరు సంతానం. ప్రవీణ్రావు అమెరికాలో ఉన్నత చదువుల చదివి ప్రయోజకుడు కాగా, కూతురు వైద్య రంగంలో ఎండీ ఫిజీషియన్ చదువును పూర్తి చేసింది. ప్రవీణ్రావు చిన్న నాటి నుంచి చదువులో ప్రతిభ చూపేవారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ధర్మారం బ్రిలియంట్ స్కూల్లో, 6, 7 తరగతులు చొప్పదండి నవోదయ, పదో తరగతి జగిత్యాలలో పూర్తి చేశారు. వరంగల్లోని అరోరా కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో పీజీ పట్టా పొందారు. తర్వాత యూస్టన్, టెక్సాస్లోని ఏఅండ్ఎం యూనివర్సిటీలో చేరి ఎంఎస్సీ జనరల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2018 నుంచి 2019లో ఎంఏ సోషయాలజీ డబుల్ పీజీ చేశారు. అంతటితో ఆగకుండా 2019 నుంచి 2023లో మా స్టర్ ఇన్ సోషియాలజీలో పీహెచ్డీ పట్టాను సాధించారు. ఆదివారం అ క్కడి వర్జీనియా యూనివర్సిటీ నుం చి పీహెచ్డీ పట్టా అందుకోగా.. వర్సిటీ యాజమాన్యం ఆయనను అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమిస్తూ ధ్రువపత్రాన్ని అందించినట్టు ప్రవీణ్రావు తండ్రి స్వామి తెలిపారు.