ధర్మపురి : భారత రాష్ట్రపతి(President) ద్రౌపదీ ముర్ము ఆహ్వానం మేరకు ధర్మపురి పండితుడికి అపురూప అవకాశం దక్కింది. ఉగాది(Ugadi) పర్వదినం సందర్భంగా ధర్మపురికి చెందిన ప్రముఖ జ్యోతిష్యవాస్తు(Astrologer) , బ్రహ్మశ్రీ పాలెపు రాజేశ్వరశర్మ సిద్దాంతి శోభకృత్ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పఠనం చేయనున్నారు.
బుధవారం ఉదయం 11గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సమక్షంలో పంచాంగ శ్రవణం జరుగనుంది. ఈ పంచాంగ శ్రవాణాన్ని రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్(Video Conference) ద్వారా వీక్షించనున్నారు. అనంతరం రాష్ట్రపతికి, ప్రత్యక్షంగా పాల్గొనే గవర్నర్కు వేద ఆశీర్వచనం అందించనున్నారు.