హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ధరణి పోర్టల్ను ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం ధరణి ఏడాది పీరియడ్కు సంబంధించి రూపొందించిన పుస్తకాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు.