హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు డీజీ నుంచి డీజీపీ ర్యాంక్ పదోన్నతి పొందినవారిలో 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఉమేశ్ ష్రాఫ్, 1990 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారులు గోవింద్సింగ్, అంజనీకుమార్, రవిగుప్తా ఉన్నారు. వీరిలో ప్రిటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్గా ఉమేశ్ష్రాఫ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీజీ వెల్ఫేర్గా విధులు నిర్వరిస్తున్నారు. రవిగుప్తా హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా, అంజనీకుమార్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా, గోవింద్సింగ్ సీఐడీ అడిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు.