హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తమ విధులపై సంపూర్ణ అవగాహన ఉం టేనే సిబ్బంది మెరుగైన పనితీరు ప్రదర్శించే అవకాశం ఉంటుందని డీజీపీ మహేందర్రెడ్డి చెప్పారు. వర్టికల్స్వారీగా సిబ్బంది పనితీరుపై బుధవారం తన కార్యాలయం నుంచి డీజీపీ అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఆయా యూనిట్ల ఉన్నతాధికారులు సిబ్బంది పనితీరును పరిశీలిస్తూ మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విభాగాలవారీగా వా ట్సాప్ గ్రూప్లు పెట్టుకుని సమాచారాన్ని పంచుకోవాలని ఆదేశించారు.