హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. సైబర్ నేరాల అదుపునకు ప్రజలు స్వీయరక్షణ పాటించాలని శనివారం ఎక్స్ వేదికగా కో రారు. బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని, ఓటీపీలు ఇతరులకు షేర్ చేయొద్ద ని పేర్కొన్నారు.
ఏవేవో కారణాలు చెప్పి సైబర్ నేరగాళ్లు భయపెడతారని, వారికి భయపడి అడిగినన్ని డబ్బులు వేస్తే వాళ్లు మరింత రెచ్చిపోతారని చెప్పారు. కంప్యూటర్స్, ల్యాప్టా ప్స్, ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్స్లో తప్పకుండా యాం టీ వైరస్ను ఉపయోగించాలని చెప్పారు.