హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): సాంకేతికతతోపాటు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అధికారులకు సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ చర్యలపై ఐటీ, ఇండస్ట్రీ, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రూపొందించిన అంశాలపై అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతరం సైబర్ నేరాలను నియంత్రించడంతోపాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్ బుక్ను ఆయన ఆవిషరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి పోలీస్స్టేషన్లో ఒకరిని సైబర్ వారియర్గా నియమించామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ డీజీ గోవింద్సింగ్, ఐజీలు రాజేశ్కుమార్, కమల్హాసన్రెడ్డి, ఐటీ విభాగం డీఎస్పీ శ్రీనాథ్రెడ్డి, ఇన్స్పెక్టర్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.