హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): నేరాలను గుర్తించడం, ప్రాధాన్యత క్రమంలో వాటిని విశ్లేషించి సరైన పద్ధతిలో అరికట్టేందుకు ఉత్తమమైన విధానాలను రూపొందించడంలో డీసీఆర్బీ, సీసీఆర్బీ నివేదికలు అత్యంత కీలమని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవారం హైదరా బాద్లోని తన కార్యాలయంలో సీఐడీ అధికారులు, అన్ని జిల్లాల డీసీఆర్బీలతో వర్చువల్గా హాఫ్ ఇయర్లీ వర్క్షాప్ నిర్వహించారు.
నేరాల విశ్లేషణలో తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని డీజీపీ కితాబిచ్చారు. దర్పన్ యాప్ సహకారంతో నిర్వహించే పనులపై చర్చించారు. ఫింగర్ ప్రింట్స్ బ్యూరో విధులపై ప్రధానంగా చర్చ జరిగింది. వర్క్షాప్లో సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, ఐజీలు షానవాజ్ ఖాసీం, చంద్రశేఖర్రెడ్డి, హోం గార్డ్స్ డీఐజీ అంబర్ కిశోర్ఝా, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఎస్సీఆర్బీ ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో డైరెక్టర్ ఎండీ తాతారావు తదితర ఉన్నతాధికారులు ఆయా విభాగాలకు సంబంధించి ప్రజెంటేషన్స్ ఇచ్చారు.