హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నతరుణంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.
శాంతిభద్రతల నిర్వహణపై శనివారం సీపీలు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ అంశంపై సున్నితంగా వ్యవహరించాలని హెచ్చరించారు. మతపరమైన సమావేశాలు, పార్టీల ర్యాలీలు, ఊరేగింపుల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.