నల్లగొండ : జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి వద్ద ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ప్రాంతాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన డీజీసీఏ(DGCA) సాంకేతిక బృందం పరిశీలించింది. అధికారుల బృందం పలు ఆధారాలు సేకరించింది. కాగా శనివారం జిల్లాలోని పెదవూర మండలం తుంగతుర్తి వద్ద ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ మహిమ గజరాజు (29) దుర్మరణం పాలయ్యారు. నాగార్జున సాగర్ విజయపురిసౌత్ ఎయిర్ ట్రిప్ నుంచి టేకాఫ్ అయిన అరగంటలోనే సాంకేతిక లోపంతో కుప్పకూలింది.