హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఐదురోజుల పాటు కొనసాగనున్నది. ముందుగా గిరి ప్రదక్షిణ చేసి, తర్వాత నేతి టెంకాయలను సమర్పించి భవానీలు దీక్షలను విరమింపజేస్తున్నారు. ఈ ఏడాది 5 లక్షలకు పైబడి దీక్షాదారులు వస్తారని అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 7న పూర్ణాహుతితో భవానీ దీక్షా విరమణలు పూర్తవుతాయి. ఇరుముడి సమర్పణకు మహా మండపంలో ప్రత్యేకంగా 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు.