వేములవాడ టౌన్ : కార్తీకమాసం ముగుస్తుండటంతో ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధి భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచే కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు.
దాదాపు 2 గంటలపాటు క్యూలైన్లలో నిలబడి కోడె మొక్కు చెల్లించుకున్నారు. సుమారు 40 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.