జయశంకర్ భూపాలపల్లి : ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరాలలో భాగంగా రెండో రోజు బుధవారం భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా నదిలో స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, 13 నుంచి 24వ తేదీ వరకు తెలంగాణ, మహారాష్ట్రలలో ప్రాణహిత నది పుష్కరాలను నిర్వహించనున్నారు.