నిజామాబాద్ : జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకుంది. గురువారం లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. జాతరలో భాగంగా గురువారం రథోత్సవం, రథభ్రమణం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.