శ్రీశైలం : ఉగాది(Ugadi)పర్వదినం సందర్భంగా శ్రీశైలం (Srisailam temple)మల్లన్న దర్శనానికి భక్తులు(Devotees) పోటెత్తారు. మల్లన్న, భ్రమరాంబికా దేవిలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారు జామునుంచే ఆలయాల్లో పూజలు చేశారు.
భక్తుల రద్దీ దృష్ట్యా అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుతిస్తున్నారు. కాగా, మల్లన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. భక్తుల రద్దీతో శ్రీశైలంలోని పురవీధులు కిటకిటలాడుతున్నాయి. శివ నామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి.