ఏటూరునాగారం, ఫిబ్రవరి 22 : మేడారం( Medaram) సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చిన ఓ భక్తుడు(Devotee )గుండెపోటుతో( Heart attack) మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి చెందిన చింతల కొమురయ్య(68) తన కుటుంబు సభ్యులతో కలిసి మేడారం వచ్చాడు.
వీరంతా జంపన్న వాగు అవతలి వైపున విడిది చేశారు. కాగా, గురువారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే వైద్యశాలకు తరలించారు. అయితే కొమురయ్య మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జాతరలో సంతోషంగా గడుదామని వచ్చిన ఆ కుటుంబం ఇలా అనుకోని దుర్ఘటనతో విషాదంలో మునిగిపోయారు.