హైదరాబాద్ : అభివృద్ధి అంటే ఏమిటో తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. శుక్రవారం పద్మారావు నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేసిన అభివృద్ధి పనులను వివిరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చామన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలిపామని స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మొద్దన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.