మహబూబ్నగర్ : అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్నగర్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వల్ల అద్భుతమైన అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. రాబోయే 200 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రగతి ప్రణాళికలు రచిస్తున్నామని వెల్లడించారు
మినీ ఎయిర్ పోర్ట్ కోసం జీఎంఆర్ సంస్థతో చర్చించామని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ ను అతి పెద్ద మెడికల్ హబ్గా ఏర్పాటు చేస్తామన్నారు. పాత కలెక్టరేట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తాం.
భవిష్యత్తులో జెడ్పీ స్థలాన్ని కూడా మెడికల్ అదనపు సౌకర్యాల కోసం తీసుకుంటామని మంత్రి తెలిపారు. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ కన్న పెద్దగా కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు ఉంటాయన్నారు. రూ.24 కోట్లతో నక్లెస్ రోడ్డు తరహాలో రోడ్డు వేస్తాం.
భారత్ మాల రోడ్డును తాత్కాలికంగా కొందరు అడ్డుకున్నా వెనకడుగు వేయబోమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రగతిని చేసి చూపిద్దామన్నారు. త్వరలోనే సొంత స్థలం ఉంటే ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ పథకం కింద మహబూబ్ నగర్ కు 2000 ఇండ్లు వస్తాయన్నారు.