సిద్దిపేట, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృ ద్ధి, సంక్షేమ పథకాల కోసం తొమ్మిదేండ్లలోనే రూ. 9,076 కోట్లు వెచ్చింది. నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2700 కోట్లు కేటాయించింది. యుద్ధప్రాతిపదికన పను లు జరిపి రైతుల కలను సాకారం చేసింది. హుస్నాబాద్ మున్సిపాలిటీ భవనం, దవాఖాన, మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఎల్ల మ్మ చెరువు సుందరీకరణతోపాటు అంతర్గత రహదారులు, ఇండోర్ స్టేడియంతోపా టు ఏసీపీ కార్యాలయం, విద్యుత్తు డీఈ కా ర్యాలయ భవనాల నిర్మాణానికి రూ.245 కోట్లు ఖర్చు చేశారు. సోషల్ వెల్ఫేర్ ఎస్టీ గురుకులం, బంజారాభవన్, షాదీఖాన భవనాలను రూ.101 కోట్లతో నిర్మించారు. అక్కన్నపేట, కోహెడ మండలంలో 12 చెక్ డ్యాంలను రూ.70 కోట్లతో, సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో పంట కాల్వలను రూ.79 కోట్లతో నిర్మించారు. సమీకృత కార్యాలయ భవన సముదాయ నిర్మాణానికి రూ.19 కోట్లు వెచ్చించారు. సింగరాయ ప్రాజెక్టును రూ.5 కోట్లతో ఆధునీకరించారు. చేపపిల్లల పంపిణీకి రూ.22 కోట్లు ఖర్చుచేశారు.
కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి
ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల నిధులతో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. హుస్నాబాద్లో సెంట్రల్ లైటింగ్, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మినీట్యాంక్ బండ్ సుందరీకరణ వంటి పనులు ఒకనాడు ఎ ట్లున్న హుస్నాబాద్ ఇప్పుడెలా మారిందో సాక్షాత్కరిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచారు. 2014, 2018లో వరుసగా రెండు పర్యాయాలు ఇక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సతీశ్కుమార్నే సీఎం కేసీఆర్ నిలబెట్టారు. ఈ సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పని చేస్తున్నారు.
కాలం లేక పడావు పెట్టినం
గింత పెద్ద డ్యాం పడుతదని, సూత్తమని ఎన్న డు అనుకోలే. మా తండాలల్ల నీళ్లులే క ఎవుసం సెయ్య లే. కాలం లేక ఎవుసం అంతపడావు ఉండేది. రిక్షా తొక్కడానికి ముప్పై ఏం డ్లు పోయిన. సీఎం కేసీఆర్ సార్ చెయ్యబట్టే డ్యాం అయ్యింది. రైతులకు బగ్గ లా భం అయితది. డ్యాం నిండితే మా ది క్కు పంటలు మంచిగ పండుతయి.
-మాలోతు రెడ్డి, రైతు, చౌటకుంట (సిద్దిపేట జిల్లా)
గౌరవెల్లి ప్రాజెక్టు స్వరూపం