Minister Dayakar Rao | దేవాదుల కాలువ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసి, జూన్కల్లా ఆ కాలువల్లో నీళ్లు పారేలా సంసిద్ధం చేయాలని మంత్రి దయాకర్రావు ఇంజినీర్లను ఆదేశించారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలువ పనుల్లోని సమస్యలను తెలుసుకొని.. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కారం కానీ సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తేవాలని చెప్పారు.
భూ పరిహారం రైతులకు ఇప్పించడంలో జాప్యాన్ని క్షమించేది లేదని, అలాంటి పెండింగ్ పనులు ఏమైనా ప్రభుత్వం వద్ద ఉంటే తమ దృష్టికి తెచ్చి వెంటనే ఆ నిధులను రైతులకు ఇప్పించాలని సూచించారు. మేయిన్ కెనాల్పై దృష్టి పెట్టాలని, నష్కల్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి రిజర్వాయర్ వరకు నిర్మిస్తున్న మేయిన్ కెనాల్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ఇదే కెనాల్లో 8ఎకరాల మేర రైతులకు భూ పరిహారానికి సంబంధించి టోకెన్ ఇచ్చారని, అందుకు సంబంధించిన డబ్బులను వెంటనే రైతులకు ఇప్పించాలని అధికారులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ వివరాలు తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి డబ్బులు రైతులకు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. 7ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు సంబంధించి జీ-తమ్మడపల్లి నుంచి గంట్లకుంట వరకు నిర్మించాల్సిన కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. రాయపర్తి మండలం కొలన్పల్లి, తిరుమలాయపల్లి తదితర గ్రామాల గుండా గంట్లకుంట వరకు వచ్చే కాలువల పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో వరంగల్ చీఫ్ ఇంజినీర్ రమేశ్ బాబు, ఎస్ఈ సుధీర్, ఈఈలు సీతారాం, ప్రవీణ్, డీఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.