హైదరాబాద్ : నదులను నాశనం చేసేది మన మానవ జాతినే. మనుషుల స్వార్థం వల్లే ప్రకృతి నాశనం అవుతుంది. సీఎం కేసీఆర్ నదుల సంరక్షణకు పాటు పడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నదుల పరిరక్షణపై జరుగుతున్న జాతీయ సదస్సులో.. రెండోరోజు మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇవాళ ఎక్కడ చూసిన నీళ్ల గురించే మాట్లాడుతున్నాం.
నీళ్లను వస్తువుగా, నీళ్లను సెంటిమెంట్గా చూస్తున్నాం. నీళ్లే ప్రాణం. నీళ్లు లేనిదే ప్రాణి లేద్నారు. మూసీ నది ఒడ్డున మనం ఉన్నాం కానీ, మూసీ నది ఆనవాళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మురుగు నీరు తాగిన ఏకైక పట్టణం సూర్యాపేట పట్టణం. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ కార్యక్రమంతో మాకు ఆ బాధలు పోయాయన్నారు. దేశంలో నీళ్లు కొనుక్కుని తాగిన ఏకైక పట్టణం కూడా సూర్యాపేట పట్టణమే కానీ ఇప్పుడు అలాంటి సమస్య లేదన్నారు.
మల్లన్న సాగర్ నిర్మాణంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందిస్తున్నాం. 2014 ముందు నల్గొండ జిల్లా ప్లోరోసిస్ తో ఉండే దాదాపు 2 లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడ్డారు. తెలంగాణ వచ్చాక ఫ్లోరోసిస్ పై సీఎం కేసీఆర్ ఆలోచన చేసి విజయం సాధించారని గుర్తు చేశారు.
గత సంవత్సరం నుంచి ఒక్క ఫ్లోరోసిస్ కేస్ కూడా నమోదు కాలేదన్నారు. సీఎం కృషితో వలసలు వాపసు వచ్చాయి. ఇప్పుడు రికార్డ్ స్థాయిలో వ్యవసాయ రంగంలో ముందు ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఒక్కటే మాట చెప్పారు. వానలు వాపసు రావాలి. కోతులు అడవులకు పోవాలి. ఈ వానలు వాపసు తెచ్చుకోవాలి అంటే చెట్లను పెంచుకోవాలి. రాష్ట్రంలో ఏ రహదారి లో పోయిన పచ్చని చెట్లు ఇరువైపులా కనిపిస్తాయన్నారు.