వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్లో అత్యధికంగా జనవరి 6న క్వింటాల్ మిర్చికి రూ. 80,100 ధర పలికింది. శుక్రవారం రూ.70, 011లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.
మిర్చి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దేశీ రకం మిర్చి చాలా తక్కువ వచ్చిందని, దీనికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో ధరలు బాగా పలుకుతున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాయిలపల్లి గ్రామానికి చెందిన రుద్రారపు రాజయ్య 2 బస్తాల మిర్చిని మార్కెట్కు తీసుకువచ్చాడు. సీతారామ ట్రేడర్స్ అడ్తి ద్వారా శ్రీ చైత్ర ఎంటర్ప్రైజెస్ కరీదు వ్యాపారి అత్యధికంగా క్వింటాకు రూ.70, 011తో కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.