హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 61 ఏండ్లు దాటిన తర్వాత కూడా సర్వీసులో కొనసాగిన 3,797 మంది వీఆర్ఏల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించాలని మండలి విప్ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. గ్రామాల్లో భూముల సమాచారం సేకరించడం దగ్గరి నుంచి పంటల సర్వేలు, సహజ విపత్తుల సందర్భంలో సహాయక చర్యల్లో పాల్గొనడంతోపాటు మృతదేహాలకు కాపలా కాసే నడిచే దేవుళ్లు వీఆర్ఏలు అని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, 20,554 మందిని రెగ్యులరైజ్ చేసినట్టు గుర్తుచేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్రెడ్డి వీఆర్ఏల ధర్నాలకు హాజరై వారి వారసులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు.