హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారులకు వేసవిలో ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. ప్రస్తు తం ఉన్న సౌకర్యాలు, శాశ్వత పద్ధతిన కొనుగోలు చేయాల్సిన సామాగ్రి, రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్కు ఆయన పలు సూచనలు చేశారు.