హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అభ్యర్థించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్లమెంట్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో తెలంగాణ నుంచి భట్టి విక్రమార పాల్గొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం చేయాల్సిన వ్యూహ రచనపై అధిష్ఠానం దిశానిర్దేశం చేసినట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్టుగానే ప్రజలు కాంగ్రెస్ను పార్లమెంటు ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు, మీడియాకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.