హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పనులను శాఖలవారీగా ప్రాధాన్యతా క్రమంలో విభజించాలని డిప్యూటీ సీఎం, సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ఆదేశించారు. సూచించిన మేరకు అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి రావాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్స్ సబ్కమిటీ సమావేశం జరిగింది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పోలీస్శాఖ ప్రతిపాదనలపై సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఒకవేళ ప్రతిపాదనలు ఎక్కువగా ఉంటే సంవత్సరాల వారీగా ప్రాధాన్యత క్రమంలో విభజించాలని అధికారులను కోరారు. సమావేశంలో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వివిధ శాఖల కార్యదర్శులు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ పాల్గొన్నారు.