హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ( CPRO ) మారబోయిన మధుసూదన్ ( Madhusudan ) గుండెపోటు ( Heart Attack) తో మరణించారు. సోమవారం మధ్యాహ్నం చాతి నొప్పితో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే మరో మారు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నుముశారు. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక బాధ్యతలను నిర్వహించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
మధుసూదన్ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత నిజాయితీ గల పాత్రికేయన్ని కోల్పోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. వృత్తిపట్ల మధుసూదన్ అత్యంత నిబద్ధత కలిగిన పాత్రికేయుడని కొనియాడారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్ననని, ఆయన కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.