హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం తర్వాత జరగనున్నది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రక్రియ ముగిసి, అసెంబ్లీ వాయిదా పడగానే కమిటీ హాలు నంబర్-1లో ఈ భేటీ కొనసాగుతుంది.
ఈ సందర్భంగా బడ్జెట్కు క్యాబినెట్ ఆమో దం తెలుపనున్నది. శనివారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.